కందుకూరు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

కందుకూరు(ప్రకాశం): కందుకూరు మండలం ఓగూరు శ్రీ వెంకటరమణ ఎకో ఫ్యాక్టరీలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కందుకూరు ఫైర్‌ ఆఫీసర్‌ డి.వెంకటేశ్వర్లు, సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.