ఉదయగిరిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉదయగిరి, జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి కొట్టే వెంకటశ్వర్లు ఆదేశాల మేరకు వింజమూరు మండలంలో జనసేన పార్టీ తరఫున పేదలకు బిర్యాని ప్యాకెట్లు పంపిణి చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వింజమూరు మండల ఉపాధ్యక్షులు షేక్ సుభాని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శలు షేక్ ఇమ్రాన్, విజయ్ కార్యదర్శులు కిషోర్, ఏడుకొండలు, పవన్, మండల నాయకులు శివ, రాజా, పెంచిలయ్య కార్యకర్తలు షరీఫ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.