అంకాలగుడెం జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

కొయ్యలగూడెం మండలం, అంకాలగుడెంలో అంబేద్కర్ గారి జయంతి సంధర్భంగా జనసేన పార్టీ ఆద్వర్యంలో ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. పలువురు వక్తలు ఆయన చేసిన గొప్ప పనుల గురించి కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిపిండి సుభ్రమణ్యం, మండల అద్యక్షులు తోట రవి, మాదేపల్లి శ్రీనివాస్, చెప్పుల మధుబాబు, ఏపూరి సతీష్‌, చవ్వా రాము, మేడిన కన్నయ్య, అల్లం రాజు, దాకారపు మధు, గేలం భాస్కరరావు, ప్రగడ సురేష్‌, ప్రగడ రమేష్‌ తదితరులు పాల్గొనడం జరిగింది.