పాలవలస, పిసిని చంద్రమోహన్ లకు ఘన సన్మానం

విజయనగరం: జనసేన పార్టీ టీడీపీ సమన్వయ కమిటీలో నియమితులైన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఆల్ ఇండియా తూర్పు కాపు వ్యవస్థాపక అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండలం జనసేన నాయకులు మహంతి ధనుంజయ నాయుడు, మరియు జమ్మూ గణేష్, పాండ్రంకి అప్పారావు, బెల్లనా శ్రీను, అల్లాడ ధర్మ, మురళి, బొబ్బిలి వీరమహిళ రామలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది.