చలమలశెట్టి వేణుగోపాల్ కు అండగా ప్రవాస ఆంధ్ర జనసేన

మచిలీపట్నం నియోజకవర్గం, 7 వ డివిజన్లోని చలమలశెట్టి వేణుగోపాల్ వినికిడి మరియు కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ప్రవాస ఆంధ్ర జనసేన తరపున చలమలశెట్టి బాలాజీ మరియు వారి మిత్రబృందం వారికి చెవిటి మిషన్ ను మరియు కంటి ఆపరేషనుకు ఆర్థిక సహాయాన్ని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని ఈ సందర్భంగా బండ్రెడ్డి రామకృష్ణ కొనియాడారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చలమలశెట్టి వేణుగోపాల్ గారికి రాబోవు కాలంలో ఆర్థికంగా తోడ్పాటును అందించి, జీవనోపాధిని కల్పిస్తామని చెప్పి మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ బండి రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఒంపుగడవల చౌదరి, 7వ డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జ్ తిరుమలశెట్టి నాగరాజు, నగర ఉపాధ్యక్షులు ఎండి సమీర్, జనసేన పార్టీ కృష్ణాజిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు వడ్డీ చిరంజీవి కుమార్, తోట రాజేష్, అనుమకొండ ఏ.వి.ఆర్, తోట భాస్కరరావు, శరత్, అడపాల గుణసాగర్ మచిలీపట్నం, నియోజకవర్గ జనసైనికులు మరియు వివిధ డివిజన్ల ఇన్చార్జిలు పాల్గొన్నారు.