భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుకు హామీ యాత్ర

కాకినాడ సిటిలో జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుకు హామీ యాత్ర కార్యక్రమం అగ్రహారం సతీష్ ఆధ్వర్యంలో 46 డివిజన్ మహాత్మా వీధి ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తప్పులు జరగడం మానవసహజం అనీ కానీ జరిగినది తప్పు అని నలుగురూ చెప్పాకా కూడా మూర్ఖంగా సరిదిద్దుకోని ప్యూఢల్ మనస్తత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. నవ్వి పోదురుగని నాకేటి సిగ్గు అన్న చందాన ఇప్పటికీ ఇసుక సరఫరా విధానం టెండరులు వేరే రాష్ట్రం నుండీ నిర్వహిస్తూ తనసొంత మనుషులకు కట్టబెట్టి అక్రమంగా సంపాదించాలని తప్ప కునారిల్లుతోన్న భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి రాకపోవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. పైపెచ్చు ఇదివరకు ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక ఇవ్వడం తప్పు అన్నట్టు చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడం తన నిరంకుశ మనస్తత్వానికి పరాకాస్టగా ప్రజలు భావిస్తున్నారనీ, త్వరలో ఈ వై.సి.పి ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రహారపు సతీష్, భగవాన్, కుమార్, నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.