వైనాట్ 175 అనేది ఫెమిలియర్ జోక్: కిరణ్ రాయల్

తిరుపతి, జగన్ ను కాదని పట్టుభద్రులు ప్రతిపక్షానికి ఓటేశారని, దొంగ ఓట్లు వేయించడం కూడా వైసీపీ నాయకులకు చేతకాలేదని ఎద్దేవా చేశారు. 6వ క్లాస్ చదివినవారితో పట్టభద్రులు ఓట్లు వేయించారని శుక్రవారం మీడియా ముఖంగా తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, మనోజ్ మునుస్వామి, కిషోర్ లు ఆరోపించారు. జనసేన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అడ్డుకుంటే వైసీపీ నాయకులు ఇంట్లో నుండి బయటకు రాలేరని హెచ్చరించారు. సీఎం జగన్ కు దమ్ముంటే పులివెందులలో గెలవాలనీ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తస్మాత్ జాగ్రత్త అంటూ వారు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వారికి అండగా నిలబడుతున్నారని జనసేన కచ్ఛితంగా వైసీపీని గద్దె దించుతుందని, పిల్లలకు పాఠాలు చెప్పేది 16 నెలలు జైలులో ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఆ అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఖాయమని కిరణ్ జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని
వైసీపీ పాలనను వద్దని జనం తీర్పు ఇచ్చారన్న విషయాన్ని మరవవద్దని గుర్తుచేశారు. వైకాపా సొంత పార్టీ ఎమ్మెల్యేలే మార్పు కోరి వైకాపా నేతలను ఓడించారని వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే ఓటు వేయించుకోలేని జగన్మోహన్ రెడ్డికి 2024లో ఓట్లు ఏలా వేస్తారని ఒక పోస్టర్ ను జనసేన నేతలు విడుదల చేశారు.