తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా కార్యాచరణ గురించి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అధినేత పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొడిశెట్టి విజయ్, కల్లెపు అజయ్, మోరె బాబు, చెల్పూరి వినోద్, మంద శ్రావణ్, మొలుగూరి అరవింద్, గుండా సాయిచంద్, బండారి రణధీర్, బండారిపెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.