నర్సంపేట జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

నర్సంపేట, గురువారం భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త “డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్” గారి 131 వ జయంతి వేడుకలను జనసేన పార్టీ అధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని ద్వారక పేట రోడ్, ఎస్.సి కాలనీలో జనసేన క్రియాశీలక సభ్యుడు ఇసురం. యాకూబ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు. శివ కోటీ యాదవ్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక జ్ఞానంతో కూడిన “శక్తి” అని.. అంబేడ్కర్ అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తనను తాను సమర్పించుకున్న ఒక “త్యాగం” అని, అంబేద్కర్ అంటే దేశంలోని అణగారిన వర్గాలకి జీవాన్ని, గుర్తింపు, చరిత్రను, భావా జాలాన్ని, భవిష్యత్తు పట్ల ఆశను కల్పించిన “ఆశ జ్యోతి” అని అన్నారు. అంతే కాకుండా భారత దేశాన్ని వివేకవంతమయిన దేశంగా మార్చడానికి క్రియాశీల పాత్ర వహించడంలో అంబేద్కర్ ప్రథముడు అన్నారు. అలాగే అంబేద్కర్ గారి క్రమశిక్షణతో కూడిన నియమబద్దమయిన జీవితం “నేటి తరం నాయకులకి, ప్రతి ఒక్కరికీ ఆదర్శం” అన్నారు. నేడు అంబేద్కర్ గారు కలలు కన్న ఆశయాలకి అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా “జన సేన పార్టీని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకు వెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువజన నాయకులు వంగ. మధు, ఓర్సు. రాజేందర్, డేవిడ్ రాజ్, క్రియాశీలక సభ్యులు అండే. రంజిత్, మాధారపు కృష్ణ, రమేష్, అజయ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.