తుని జనసైనికుల ఆత్మీయ సమావేశం

తుని నియోజకవర్గంలో శుక్రవారం తుని మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా నియోజకవర్గం పరంగా చేపట్టాల్సిన బవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, తదుపరి రోజుల్లో చేయవల్సిన కార్యక్రమాలు మొదలగు విషయాలను గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, తుని మండల అధ్యక్షులు ధారకొండ రమణ, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, జనసైనికులు పాల్గొన్నారు.