ప్రతి లారీ ఓనర్ కు సమన్యాయం కల్పించాలి: పోలిశెట్టి

  • బూడిద ఎగుమతి సమయంలో ప్రతి లారీ ఓనర్ కు సమన్యాయం కలిగించాలి..

మైలవరం: బూడిద రవాణాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా లారీ ఓనర్ల అందరికీ సమాన హక్కు కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఎన్.టి.టి.పి.ఎస్ లారీ ఓనర్ అసోసియేషన్ సొసైటీ కార్యక్రమానికి పోలిశెట్టి తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ మాట్లాడుతూ బూడిద లోడింగ్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడానికి ఈ సొసైటీ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఎన్.టి.టి.పి.ఎస్ యాజమాన్యంతో చర్చించి జనసేన పార్టీ తరఫున మరియు లారీ యూనియన్ తరపున చీఫ్ ఇంజనీర్ గారికి లోడింగ్ సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేస్తామని లారీ ఓనర్లకు మా వంతు సహాయ సహకారాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లారీ ఓనర్ అసోసియేషన్ పెద్దలు మరియు కృష్ణాజిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు నూతన కమిటీ సభ్యులు, లారీ ఓనర్లు మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.