నిరుపేద కుటుంబానికి ఆర్థికసాయమందించిన గోరంట్ల జనసైనికులు

గోరంట్లలోని 4 వ వార్డులో గల నౌషాద్ అఖిల దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకుని జనసైనికులు 5 వేలు రూపాయలు ఆర్థిక సాయం సాయం చేసి ఉన్న ఆడపిల్ల చుదువు కోసం కూడా సాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, మండల నాయకులు వెంకటేష్, బండారు మల్లికార్జున, పొగతోట వెంకటేష్, అనిల్ కుమార్, నరేష్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.