భవానిపురంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

  • జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో నిరసన

విజయవాడ వెస్ట్: విజయవాడ భవానిపురం శివాలయం సెంటర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా క్రాంబే రోడ్డుని కుద్దూస్ రోడ్డుగా నామకరణ చేయాలని కోరుతూ జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. ఒక భవానీపురంలో అర కిలోమీటర్ లోపు ఎన్ని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తారని అన్నారు. ఒక రాత్రికి రాత్రి ఈ భవానిపురంలో ఇప్పటికి మూడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. మరి ఇంత అధికారం మదంతో విరవిగుతున్నారా వైసిపి పార్టీ వాళ్లు ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజల ఆస్తులు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ ఒక పార్కులో విగ్రహం ఏర్పాటు చేశారు. దేశ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి గారి పేరు తీసేసి రాజశేఖర్ రెడ్డి పార్క్ అని పెట్టారు. ఇప్పుడు శివాలయం సెంటర్లోమరొక విగ్రహం పెడుతున్నారు. దీనిని మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నామని అనూష తెలిపారు.