కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం, బతినయ్య యానాది కాలనీకి చెందిన బాబు, గోవిందమ్మల 2 సంవత్సరాల కుమారుడు సోమవారం రోజున తినుబండారంగా భావించి గుళికల మందును తిని మృతి చెందడం బాధాకరం. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం నింపి, ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు చందు చౌదరి, సావిత్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.