నూజివీడు రూరల్ మండలం కమిటీల ఏర్పాటు

కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలోనీ ముసునూరు మండల, చట్రాయి మండలం, అగిరిపల్లి మండలం, నూజివీడు రూరల్ మండలం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మండల కమిటీ లిస్టు ని జనసేన పార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివ రామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి మరియు నాలుగు మండలాల అధ్యక్షులు నూజివీడు రూరల్ మండల అధ్యక్షులు రాము, ఆగిరిపల్లి మండల అధ్యక్షులు పవన్, చట్రాయి మండల కృష్ణ, ముసునూరు మండల అధ్యక్షులు కిరణ్ నూజివీడు నియోజకవర్గ నాయకులు బండారు రాజు, పాశం నాగబాబు, బెజవాడ రాజేష్, రామిశెట్టి తేజేశ్వని అందజేయడం జరిగింది. అనంతరం నూజివీడు నియోజకవర్గ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.