కేతవీరునిపాడు గ్రామంలో తంబళ్ళపల్లి పర్యటన

నందిగామ నియోజకవర్గం: నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించి గ్రామంలోని జనసేన నాయకులను జనసైనికులను వీరమహిళలను మరియు టిడిపి నాయకులను కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం జనసేన బిజెపి టిడిపి కూటమిగా ఏర్పడి ఈ వైసీపీ నిరంకుశ పాలనపై యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలంతా కూడా ఐక్యమత్యంగా వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ని మరియు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ (చిన్ని) వీరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, అందుకు జనసేన ఓట్లు కీలకమని తెలియచేశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం శిరోధార్యంగా భావించి ప్రతి ఒక్క జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు వారి యొక్క ఓటును 100% ఎన్డీఏ కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యేలా కృషి చేయాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించడంలో మన వంతు సమిష్టిగా కలిసి పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు టిడిపి నాయకులు జన సైనికులు, వీరమహిళలు, టిడిపి కార్యకర్తలు కలిసి పాల్గొన్నారు.