క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద బీమా చెక్

అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం, రుద్దం మండలం రెడ్డిపల్లి గ్రామంకు చెందిన కురుబ హనుమంత్ కు ఇటీవల దొడ్బల్లాపూర్ నుంచి బైక్ లో వస్తుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కు గురై గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. తాను క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడంతో ప్రమాదపు బీమా క్రింద 18 వేల రూపాయల చెక్కును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హనుమంత్ కు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి అందజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాలు ప్రధాన కార్యదర్శి శ్రీ పి.భవాని రవికుమార్ మరియు జిల్లా కమిటీ సభ్యులు, ప్రాంతీయ కమిటీ మహిళా సభ్యులు, జనసేన శ్రేణులు పాల్గొనడం జరిగింది.