పవన్ కళ్యాణ్ పై అసభ్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

  • హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన జనసేన నాయకులు

హుస్నాబాద్: తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వొద్దమల్ల విజయ్, తోడేటి సంపత్, సోషల్ మీడియా సెక్రటరీ రెడ్డి గోపినాథ్, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.