పవనన్న సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి

  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
  • పవనన్న ప్రజా బాట 93వ రోజు

ఒంటిమిట్ట: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాలలో సాధ్యమని రాష్ట్ర జనసేన చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం గురువారంతో 93వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంటిమిట్ట మండలం పరిధిలోని మండపంపల్లె గ్రామపంచాయతీ మారయ్య గారి పల్లె, పలు గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాల కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజాపాట సాగుతుంది. ఈసందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాఠాల రామయ్య మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనను ప్రజలందరూ, దృష్టిలో ఉంచుకొని రాబోయే 2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.