రైస్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఆరపల్లెలోని అనందాసు రాంమోహన్ రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని ఎం.ఆర్.ఓ అధికారులకు ఫిర్యాదు చేసి, నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోనందున, నియోజకవర్గ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ జనసేననాయకులతో కలసి మరొక్కసారి ఎం.ఆర్.ఓను కలిసి దానికి గల కారణాలేంటని అడిగి తెలుసుకోవడం జరిగింది. మిల్లు నుంచి వెలువడే బూడిద వల్ల వ్యవసాయ దారులు, వాహనదారులు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఒకవేళ చర్యలు తీసుకోని యెడల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు మల్లెల సంతోష్, లక్కిరెడ్డి హిమవంత్, గుండా సాయి చంద్, సీత రాజు, ఎల్కపల్లి సంతోష్, వెల్దండి నిఖిల్, మ్యాకల రాజు తదితరులు పాల్గొన్నారు.