పవన్ కళ్యాణ్ పై అసభ్య ప్రచార చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజోలు జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అధికార మదంతో సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైసీపీ పార్టీకి చెందిన రవీంద్ర రెడ్డి, ఇతర వైసీపీ పార్టీకి చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్వర్యంలో రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, నాయకులు గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్, అల్లూరి రంగరాజు, ఉండపల్లి అంజి, గుణిశేట్టి రామ్ జీ, పోతు కృష్ణ, బళ్ల శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు, వెంకటరాజు, తూతిక ఆది, మండేలా బాబీ నాయుడు, రాంబాబు, గిడుగు రాంబాబు, నామన సూర్యనారాయణ, రాహుల్ గాంధీ, మేడిచర్ల కిషోర్, సాధనాల విజయ్, పవన్ తేజ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.