సీతారామపురంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, సీతారామపురం గ్రామంలో పలు కుటుంబాలను శనివారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. గ్రామంలో ముమ్మన వెంకట్ రావు ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. అనంతరం పల్లపు విష్ణు ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోదైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నక్క వెంకట్ రావు, కూరాకుల తాతారావు, ఈ. రాధా కృష్ణ, అడబాల రాజబాబు, బదిరెడ్డి సుబ్బారావు, అడబాల బాబీ, వేగిశెట్టి రాజు, దేనిడి మణికంఠ స్వామి, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.