క్రియాశీలక సభ్యులే పార్టీకి వెన్నుముక: యుగంధర్ పొన్న

*రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించేది అభిమానులే
*సమయం ఆసన్నమైంది వైసీపీని గద్దెదించాలి
*ఇంచార్జి డా యుగంధర్ పొన్న

పెనుమూరు మండలంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యులే వెన్నుముక అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మార్పులు సంభవించభోతోందని కాబట్టి రాష్ట్రంలో క్రియాశీలక సభ్యులు ముఖ్య భూమిక పోషించిబోతున్నారని తెలియజేశారు. సమయం ఆసన్నమైంది, వైసీపీని గద్దె దించాలని ఉద్భోద చేశారు. మండలాల్లో ఉన్న జనసైనికులు అందరూ క్రియాశీలక సభ్యులు పార్టీ సంస్థాగత నిర్మాణంలో పాలి భాగస్తులు కావాలని తెలిపారు. రానున్నది జనసేన ప్రభుత్వమే అని తెలియజేశారు. ఇప్పటివరకు మండలంలో 250 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గిరిదర్నాయుడు, ప్రధాన కార్యదర్శి మంజునాథ్, వైస్ ప్రెసిడెంట్ జావిద్, యూత్ ప్రెసిడెంట్ గురుప్రసాద్, శేఖర్, ధాము, సునీల్, నవీన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.