లచ్చయ్యపేట గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఆముదాలవలస నియోజకవర్గం, లచ్చయ్యపేట గ్రామంలో జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిక్కోలు విక్రమ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు వలన కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్క యువకుడికి వివరించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం ప్రతి యువకుడు వినియోగించికోవాలని, ప్రమాదం జరిగినపుడు మనకి ఒక పెద్ద కొడుకుగా అధినేత కళ్యాణ్ అండగా ఉంటారని వివరించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోఅన్వేష్, మహేష్, గిరిబాబు, ఉపేంద్ర, పవన్, గణేష్ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.