చిట్టివనిపాలెంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గాజువాక నియోజకవర్గం, 70 వార్డు చిట్టివనిపాలెం గ్రామంలో వీరమహిళలు దుర్గా, రామలక్ష్మి మరియు జనసైనికులు రవీందర్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కేంద్రం ఏర్పాటు చేసి, భారీ ఎత్తున క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. ప్రతి జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా తెలియజేయడమైనది.