తాటిరాముడు గూడెం గిరిజన గ్రామాల్లో జనంకోసం జనసేన

పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం తాటిరాముడు గూడెం గిరిజన గ్రామాల్లో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాలరాజు జనంకోసం జనసేన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి.. ప్రజల సమస్యలను తెలుసుకోవటం జరిగింది.. అలాగే ఆ గ్రామంలో ముఖ్యమైన సమస్య ఇళ్ళు మరియు రోడ్లు, డ్రైనేజీలు.. ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటుతున్నా.. గిరిజన గ్రామాల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దోచుకుని దాచుకోవడం తప్ప ఒక్కసారి కూడా గిరిజన గ్రామాలను వచ్చి చూడలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోను వారికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, వెంకటేశ్వర్లు, కొప్పుల శ్రీకాంత్, కె రమేష్ సోమరాజు, ప్రెసిడెంట్ అభ్యర్థి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.