సానరుద్రవరంలో క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ

కైకలూరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పండగలా మొదలైన 13వ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలో, కలిదిండి మండలం, సానరుద్రవరంలో క్రియాశీలక కిట్లు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, నియోజకవర్గ నాయకులు వలవల రవితేజ, కేసిరెడ్డి సాయికుమార్, గంధం నాగరాజు తదితర జనసైనికులు జనసేన అభిమానులు పంపిణీ చేయడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పని చేద్దాం అని దిస నిర్దేశం చేసారు.