ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

మార్కాపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం మార్కాపురం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న నియోజకవర్గ కార్యాలయం ఆవరణలో.. మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో.. కోలాహలంగా జరిగినది. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న వాలంటీర్లను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆలోచనలను జనసైనికులు అనుసరిస్తూ.. పార్టీని బలోపేతం చేసే దిశగా ముందడుగు వేయాలని.. తద్వారా ప్రజలకు ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్, జిల్లా సంయుక్త కార్యదర్శి సురేష్, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండలం అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, జనసేన నాయకులు, వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.