బుడంపాడు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు

గుంటూరు, జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగర పరిధిలోని 16 వ డివిజన్ బుడంపాడు గ్రామంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 16 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గ, గుంటూరు నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, నగర కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు, 16 డివిజన్ అధ్యక్షులు విష్ణుమొలకల ఆంజనేయులు, బుడంపాడు జనసేన నాయకులు ఆకుల వీరరాఘవయ్య, మన్నేస్వాములు, కుర్ర రవి, చక్క అంజి, లింగాల నంచరయ్య, చింతా సారథి, ఆములోతు నాగరాజు, బాలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.