అనంతపురం లో టిడిపి మరియు సిపిఎం నుండి జనసేనలో చేరికలు

అనంతపురం అర్బన్ లోని స్థానిక రాంనగర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మరియు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు నగరంలోని 39,41,47 డివిజన్లు టిడిపి మరియు సిపిఎం పార్టీల నుండి జనసేన పార్టీలోకి కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న వడ్డెరలను ఏకతాటిపైకి తెచ్చి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర, రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జీ సాకే పవన్ కుమార్, కార్యదర్శులు ఇండ్ల కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, నాయకులు జక్కిరెడ్డి ఆదినారాయణ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.