కంచే చేను మేస్తే మహిళలను కాపాడేది ఎవరు: దేవరకొండ జయమ్మ

అనంతపురం జిల్లా, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేదు.. రాష్ట్రంలో మహిళలు భయబ్రాంతులకు గురవుతున్నారు.. నరకం అనుభవిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో బి ఫార్మసీ అమ్మాయి తేజస్వినిని సామూహిక అత్యాచారం చేసిన హంతకులను ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ వైసీపీ ప్రభుత్వానికే సిగ్గు చేటు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత మాటలు వింటుంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. మంత్రులంతా జగన్ కు భజనలు చేస్తున్నారు తప్ప.. వారంలోనే మహిళల పైన ఇన్ని హత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది..? మీకు చేతకాకపోతే రాజీనామాలు చేసి వెళ్ళండని అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి దేవరకొండ జయమ్మ ఎద్దేవా చేశారు.