చంద్రగిరి జనసేనలో చేరికలు

చంద్రగిరి, జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర మరియు మండల అధ్యక్షులు సంజీవి హరి సమక్షంలో చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం నిర్వహించి, మండల కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే చేరికలలో భాగంగా జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి, శుక్రవారం టీడీపీ నుండి జనసేనలోకి శ్రీమతి ఆషా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతం కిరణ్, ఢిల్లీ, వాసు, దిలీప్, రాంబాబు, పవన్, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.