జగన్ రెడ్డిని తక్షణమే మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి: పాలవలస

విజయనగరం: విశాఖ పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి యశస్వి ఖండించారౌ.. శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగత విమర్శలను చేసే నీచ దరిద్రపు జగన్ రెడ్డిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని,
అన్ని కేసుల్లో జైల్లో నుంచి బెయిల్ పై బయటకు వచ్చి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే ఆ హక్కు, స్థాయి గాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ శ్రీమతి మాత గాయత్రి, డా.రవికుమార్ మిడతాన, రామచంద్ర రాజు, మోపాడు అనిల్, దిండి రామారావు, బూరిల విజయ శంకర్, శంకర్ జనసైనికులు పాల్గొన్నారు.