యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించిన పాలవలస

  • యువతకు భరోసా నింపే విధంగా యువశక్తి కార్యక్రమాన్ని రూపొందించిన పవన్ కళ్యాణ్

విజయనగరం: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జనవరి 12న, యువతకు భరోసా నింపే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జనసేన పార్టీ యువ శక్తి పేరిట నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన రూపొందించిన పోస్టర్ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యువ శక్తి పేరుతో ఈ సభను తలపెట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకట్లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమం విజయనగరం జిల్లా నుంచి అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొంటున్నారని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమం సంబంధించి యువశక్తి పేరట జిల్లా అంతటా కూడా ప్రచారం ప్రారంభించామని తెలిపారు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున, జన శ్రేణులు తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ శ్రీమతి మాత గాయత్రి, దిండి రామారావు, బూరిల విజయ శంకర్, మోపాడు అనిల్, జనసైనికులు పాల్గొన్నారు.