3803 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన AIIMS

ఎయిమ్స్‌ దేశ‌వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఓఆర్‌సీటీ)-2020‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి.

మొత్తం పోస్టులు: 3803

ఎయిమ్స్ న్యూఢిల్లీ – 597

భువ‌నేశ్వ‌ర్ – 600

డియోగ‌ఢ్ – 150

ఘోర‌క్‌పూర్ – 100

జోధ్‌పూర్ – 176

క‌ల్యాణి – 600

మంగ‌ళ‌గిరి – 140

ప‌ట్నా – 200

రాయ‌బ‌రేలి – 594

రాయ్‌పూర్ – 246

రిషికేశ్ – 300

విద్యార్హత: డిప్లొమా (జీఎన్‌ఎమ్‌)/బీఎస్సీ (ఆన‌ర్స్‌) న‌ర్సింగ్ లేదా బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ న‌ర్సింగ్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1200, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉచితం.

ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభ తేది: ఆగస్టు 5, 2020

దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 18, 2020 సాయంత్రం 5 గం వరకు

సీబీటీ పరీక్ష తేది: సెప్టెంబర్‌ 1, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.aiimsexams.org/