అగ్నిప్రమాద బాధితులను ఆదుకున్న గెడ్డం ఆకాష్

రాయవరం మండలం, గోకులపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు పూరిల్లు అగ్నికి పూర్తిగా దగ్దమైనవి.. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి తనయుడు నేషనల్ రైఫైల్ గెడ్డం ఆకాష్ ఆ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు నెల రోజులకి సరిపడ బియ్యం, నిత్యావసర సరుకులతో పాటుగా 5000 రూ. నగదు సహాయం చేశారు.