అఖిలప్రియకు 14రోజుల రిమాండ్

సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టు అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ఏ2 నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిటీ సివిల్‌ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు ఆమెను బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రేపు ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అఖిలప్రియ తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని దాఖలైన పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి.