ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థులు ప్రకటన..!

తెలంగాణలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు పేరును ప్రకటించింది. అలాగే వరంగల్‌-నల్గొండ-ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ అధిష్టానం కోరింది.

ఇకపోతే మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌ రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇకపోతే ఈ ఎన్నికలతోపాటే ఏపీలోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్‌ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ..

పోలింగ్‌ తేది: మార్చి 14

నోటిఫికేషన్‌/నామినేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 16

నామినేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 23

నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24

నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 26

పోలింగ్‌ సమయం: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు

ఓట్ల లెక్కింపు: మార్చి 16

హైదరాబాద్‌ స్థానంలో ఓటర్లు 5,21,386

వరంగల్‌ స్థానంలో ఓటర్లు 4,92,943