నాగబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అళహరి సుధాకర్

కావలి: ఉమ్మడి నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశాలకు నెల్లూరు విచ్చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ను ఆదివారం ముఖ్య నాయకుల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ ఇంచార్జి అళహరి సుధాకర్ కలిసి వారిని శాలువాతో సత్కరించి బుద్దుడి విగ్రహము ఇచ్చి సత్కరించడం జరిగింది. అదే క్రమములో కాన్ఫ్లిక్ట్ మానేజ్ మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, ఆస్ట్రేలియా నాయకులు శషి గారిని కూడా శాలువాతో సత్కరించడము జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాగబాబు సమక్షములో డిసెంబర్ 16 & 17వ తేదీలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది అని ఈ కార్యక్రమాన్ని అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్య నాయకులతో జరిగిన అంతర్గత సమావేశంలో కావలి నియోజకవర్గం కావలి నియోజకవర్గం నుండి ఇన్చార్జిగా ఆ మీటింగ్ లో పాల్గొని నాగబాబు గారిని అజయ్ కుమార్ గారిని శశి గారిని శాలువాతో సన్మానించి కావలి నియోజకవర్గం లో త్వరలో నూతన పార్టీ కార్యాలయము ఓపెనింగ్ కు తప్పక రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కావలిలో తదుపరి కార్యాచరణ గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా లోని ముఖ్య నాయకులు నియోజకవర్గం వారీగా పాల్గొనడం జరిగింది.