చెకు డ్యాము మరమ్మతులు తక్షణమే చేపట్టాలి: జనసేన డిమాండ్

*చెకు డ్యాము మరమ్మతులు తక్షణమే చేపట్టాలి.. జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, శ్రీ రాములు

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆరోగ్య నియోజవర్గం, అరకు నియోజకవర్గ కేంద్రమైన బంధం పంచాయతీ పరిధిలో గల రంపుడు వలస గ్రామంలో మంగళవారం ఉదయం జనసేన పార్టీ నియోజకవర్గ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, గతుం లక్ష్మణరావు ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా గ్రామాల్లో పర్యటించారు. ముందుగా జనసేన బృందం ఇంటింటికి వెళ్లి జనసేన మాటలు, సిద్ధాంతాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం గ్రామ పరిధిలో మరమ్మతులు ఉన్న చెకు డ్యామును గ్రామస్తులుతో పాటు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష కార్యదర్శులు సాయిబాబా, శ్రీ రాములు, వల్లంగి రామకృష్ణ, లక్ష్మణ్ రావు తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే దంపుడు వలస మరమ్మత్తులొ ఉన్న చెక్ డ్యాములకు తక్షణమే మరమ్మత్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గాయాలతో బాధపడుతున్న పెద్దకాపు సోమేశ్ కుమార్ చిన్నారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.