కాకినాడ సిటి జనసేన పార్టీలో భారీ చేరికలు

కాకినాడ సిటి: కాకినాడ సిటిలో జనసేన పార్టీ జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ ఆధ్వర్యంలో స్థానిక జగన్నాధపురం నుండి పెద్ద ఎత్తున యువకులు జనసేన పార్టీ సభ్యులు మరియు కాకినాడ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సమక్షములో జనసేన పార్టీలో చేరగా వారిని ముత్తా శశిధర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ వరిపల్లి దుర్గాప్రసాద్, వెంపల దుర్గాప్రసాద్, గోగు సతీష్, మేరుగు అజయ్ కుమార్, చక్కా శ్రీను వారియొక్క మిత్రబృందంతో కలిసి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరినందుకు చాలా సంతోషమన్నారు. మనమందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి నేత్రుత్వంలో ప్రజల తరపున పోరాటాలు చేసి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, లోపభూఇష్టమైన పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనీ, ప్రస్తుతం నేటి సమాజంలో ఒకరకమైన నిశ్శబ్ద విప్లవం గోచరిస్తోందనీ, ఈ వై.సి.పి పాలనపై తుఫాను ముందర ప్రశాంతత ప్రజలలో కనపడుతోందనీ, రాబోయే ఎన్నికల్లో దీని ఫలితం ఈ ముఖ్యమంత్రికి వై.సి.పి పార్టీకీ అర్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటి ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, నాయకులు శివాజి యాదవ్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.