ఐటిడిఏ పిఓ ఆధ్వర్యంలో ఎన్నికల విధివిధానాలపై అఖిలపక్ష సమావేశం

పాలకొండ, ఎన్నికల విధానాలపై సీతంపేట ఐటిడిఏ పిఓ ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ అధికారిని డా.బి. నవ్య ఆధ్వర్యంలో వాటర్ నెంబర్ తో ఆధార్ మరియు మొబైల్ నెంబర్ తో అనుసంధానం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ విషయమై అఖిలపక్ష రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ… ఓటరు యొక్క ప్రమేయం లేకుండా ఓటును తొలగించకుండా తగు నిభందనలు నియమించాలని. ఓటు హక్కు అర్హత ఉన్నవాళ్లు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామాల్లో మరియు పట్టణంలో నేటి తరానికి తెలిసేలా మాధ్యమాల ద్వారా సందేశం చేరవేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జనసేన నాయకులు మరియు జనసైనుకులు, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.