ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు అస్తవ్యస్థం: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, ఈ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగడం లేదని బొలిశెట్టి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంట మరియు అమృతపురం గ్రామంలో బుధవారం జరిగిన పల్లెపోరులో ముందుగా స్థానిక నాయకులతో గ్రామంలో ఉన్న దేశాలమ్మ అమ్మవారిని దర్శించుకుని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకోబడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్దేశించి బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయలేక పోయిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే నిధులను ఈ మూడు సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందన్నారు. అంతేకాకుండా పల్లెపోరులో జనసేన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ ముందు వచ్చే ఎలక్షన్లో జనసేన అధికారం సాధిస్తే ఉచిత గ్యాస్ గురించి మరియు విద్యార్థుల చదువుల గురించి వివరిస్తూ జనసేనని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండలం జనసేన అధ్యక్షులు అడప ప్రసాద్, ఇటుకలగుంట స్థానిక నాయకులు పాశం వినోద్ కుమార్, మాగంటి కోసు బాబు, చిమిలి దుర్గాప్రసాద్, మాగంటి వెంకటేష్, మెతకమిల్లి ఆనంద్ కుమార్ మరియు అమృతపురం స్థానిక నాయకులు రుద్ర రామ దుర్గారావు, రుద్ర సురేష్, రుద్ర రమేష్, రుద్ర ఏసు, ఏడిది రమేష్, రుద్ర మణికంఠ, రుద్ర బాబి మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.