యడ్లపాటి వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న నాయకులు యడ్లపాటి వెంకట్రావు తుది శ్వాస విడిచారనే విషయం బాధ కలిగించిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా వెంకట్రావు చేసిన సేవలు మరువలేనివి. తెనాలి, వేమూరు ప్రాంతాలతో ఆయనకున్న అనుబంధం విడదీయలేనిది. వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎన్నో ఆలోచనలు చేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని నాదెండ్ల మనోహర్ అన్నారు.