జనసేన పోటీకి సర్వం సిద్ధం – నవంబర్ 3న నామినేషన్: గాదె పృథ్వి

తెలంగాణ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జనసేనపార్టీ పోటీకి అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులతో అయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఐదేళ్లుగా జనసేనపార్టీ ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేసిందని తెలిపారు. దశబ్ద కాలం పాటు నియోజకవర్గంలో నాయకులుగా ఉన్న రాజయ్య, కడియంలు ఆధిపత్యం కోసం పరితపిస్తునే అభివృద్ధికి దూరం చేసారన్నారు. అధికారం కోసం ఈ నాయకులు చేస్తున్న రాజకీయాలను చూసి నియోజకవర్గ ప్రజలు విస్తుపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలు నాయకత్వ మార్పిడి కోరుతున్నారన్నారు. నియోజకవర్గ ఓటర్లు యువతను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తాను స్థానిక యువకుడినని స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి విద్యావంతుడిగా బలమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. తనకు నియోజకవర్గ ప్రజలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. బీజేపీ జనసేన పొత్తులపై పార్టీ నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదని తెలిపారు. కచ్చితంగా జనసేన పోటీలో ఉండబోతుందన్నారు. నవంబర్ మూడవ తారీఖున జనసైనికులతో ర్యాలీగా వెళ్లి జనసేనపార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖాలు చేయనున్నట్లు తెలిపారు. నేటి నుండి యధావిధిగా ప్రజల్లోకి జనసేన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రజాక్, భాషబోయిన సమయ్య, పవన్, అక్కెనపల్లి సాయి, వినయ్, వొడపెల్లి రోహిత్ తదితరులు ఉన్నారు.