జనసేన హండ్రెడ్ సోల్జర్స్ ద్వారా సహాయం అందజేత

డొంకూరు గ్రామంలో సోమవారం రాత్రి రెండు గంటల 30 నిమిషాల ప్రాంతంలో.. గుర్తుతెలియని వ్యక్తులు తొగు అప్పారావు భార్య బుద్దమ్మ షాపు పై పెట్రోల్ పోసి తగల బెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి రాజు చేతుల మీద జనసేన హండ్రెడ్ సోల్జర్స్ తమ వంతుగా నెలకు సరిపోయేటట్లు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది. బాధిత కుటుంబానికి సమాచారం ప్రకారం సుమారుగా లక్ష రూపాయలు నష్టం వాటిల్లిందని షాపు బాధితురాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, స్థానిక జనసైనికులు కృష్ణ, జానీ, ఆనంద్, మున్సిపాలిటీ వార్డు ఇంచార్జ్ సంతోష్ మహారణా, ఢిల్లీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.