ఇంకెంత కాలం వంతెన నిర్మాణం?

  • పాలకులు నిద్రలేచి పనులు చేయాలి
  • మీ ఇంటి చుట్టు రోడ్లకు సుమారు 60 లక్షలతో టెండర్లు వేస్తారు, బ్రిడ్జి నిర్మానానికి టెండర్లు వెయ్యరా…?
  • రౌడీయిజం కేసులు పెట్టడమే వచ్చు. పనులు చేయడం రాదు.
  • కరుకువాడ బేతాపూడి నుంచి జనసేన పాదయాత్ర
  • జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు.
    భీమవరం, భీమవరం మండలం తాడేరు వంతెన నిర్మాణం ఇంకెంతకాలం చేస్తారని, అధికారుల నిర్లక్ష్యం వల్లే 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) అన్నారు. మంగళవారం భీమవరం మండలం కరుకువాడ బేతాపూడి నుంచి భీమవరం వరకు జనసేన చలో పాదయాత్ర నిర్వహించారు. చినబాబు మాట్లాడుతూ భీమవరం నుండి నరసాపురం వెళ్ళే ప్రధాన రహదారిలో తాడేరు గ్రామంలో వంతెన శిధిలావస్థకు రావడం వల్ల అధికారులు వాహన రాకపోకలు నిలిపివేసి రెండు సంవత్సరాలు కావొస్తుందని, ఈ వంతెన దిగువభాగాన సుమారు 15 గ్రామాలలో 40 వేలకు పైగా జనాభా ఉన్నారని, అత్యవసర పరిస్థితులలో 108 వెళ్ళే సౌకర్యం లేదని, స్కూలు విద్యార్థులకు బస్సు వెళ్ళే పరిస్థితి లేదన్నారు. 2 ఏళ్ల నుండి ఆర్టీసి బస్సులు రాకపోకలు లేవని, దయచేసి అధికార యంత్రాంగం వంతెన నిర్మించాలని కోరుతున్నామని అన్నారు. అత్యవసర పరిస్థితులలో అగ్నిమాపక వాహనం వచ్చే పరిస్థితి కూడా లేదని, రైతులు పండించిన ఉత్పత్తులను ట్రాన్స్పోర్టేషన్ చేసుకునే కనీస సౌకర్యం లేదని, ప్రజలు 2 ఏళ్ల నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, సుమారు 40 కిమీ చుట్టు తిరిగి రావలసి వస్తుందని అన్నారు. అధికార యంత్రాంగం నిద్రలేచి ఈ గ్రామ ప్రజల గోడును పట్టించుకొని త్వరగా వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్ అండ్ బి అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్రం మత్స్యకార వికాస విభాగ చైర్మన్, నరసాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర పిఏసి సభ్యులు వేగేశ్న కనకరాజు సూరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి , పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, స్టేట్ సెక్రటరీ శాంతి ప్రియ, జడ్పిటిసి గుండా జయప్రకాష్, ఎంపిటిసి ప్రకాశం, గుల్లిపల్లి విజయలక్ష్మీ, అరేటి వాసు, తాతపుడి రాంబాబు, రాష్ట్ర నాయకులు మల్లీనిడి తిరుమల రావు, బండి రమేష్ నాయుడు, జుత్తిగా నాగరాజు, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, సెక్రటరీ నీలేంద్ర, వీరవాసరం మండలం అధ్యక్షులు గుండా రామకృష్ణ, పట్టణ సెక్రటరీ సుంకర రవి, మాజీ కౌన్సిలర్స్ వానపల్లి సూరిబాబు, మాగాపూ ప్రసాద్, అతికల అంజనేయ ప్రసాద్, ఉండవల్లి శ్రీను, సత్తివడ నవీన్, కాళీ శేఖర్, శ్యామల, మీనాక్షి, పద్మ, ప్రతిభ, మరియు నియోజకవర్గ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ లు, గ్రామ ప్రెసిడెంట్ లు, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.