నూతన సంవత్సరం శుభాకాంక్షలు: కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: పొన్నలూరు మండలం ప్రజలందరికీ పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరపు చివరి రోజుకు వీడ్కోలు చెబుతూ, రాబోయే కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మధురమైన క్షణాలను అందించాలని, కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. ప్రజలందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, కొత్త సంవత్సరంలో ఎన్నో ఆనందాలను, సంతోషాలను, ఎన్నో విజయాలను, మీకు మీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.