స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి వినతిపత్రమిచ్చిన అమర్ కార్తికేయ

కదిరి, తనకల్లు మండల ఆఫీసులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సిద్దారెడ్డి కి జనసేనపార్టీ ఎంపిటిసి అమర్ కార్తికేయ బాలసముద్రం గ్రామ పంచాయితీకి చెందిన సమస్యలను లిఖితపూర్వకంగా అర్జీ అందించి, వారికి సమస్యలను వివరించడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే మరియు ఎమార్వో లు సానుకూలంగా స్పందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఎమార్వో, ఎంపిడివో మరియు మండల అధికారులు పాల్గొన్నారు.