తుని జనసేన అధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తుని, కోటనందూరు, కాకరాపల్లి, భీమవరపు కోట, అప్పల రాజు పేట, ఎస్.ఆర్ పేట, బిళ్ళనందూరు, ఇండుగపల్లి, కె.ఓ మల్లవరం, చామవరం, అన్ని ఊళ్లలో ఉన్న మహానుభావులు డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు. ఈ కార్యక్రమంలో, కోటనందురు జనసేన మండల అధ్యక్షులు పెడపాత్రుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నక్కా రామకృష్ణ, దళిత నాయకులు లోకవరపు ఆనంద్, మరియు ఆయా గ్రామ జనసైనికులు, జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది. అంతే కాకుండా, తుని గొల్ల అప్పారావు సెంటర్లో ఇండుగపల్లి శ్రీనివాస, జనసేన శివ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తదనంతరం పేదలకు, బోజనాలు పంపిణీ చేశారు. కోటనందూరులో పేనుముచ్చు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని, సందర్శించి సంఘీభావం తెలిపారు.